మన్యం న్యూస్ : జూలూరుపాడు, అక్టోబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో ఆదివారం చేగువేరా 55వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. చేగువేరా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు ఎస్కే చాంద్ పాషా మాట్లాడుతూ.. నేటి యువకులు చేగువేరా జీవిత చరిత్రను చదివి, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప విప్లవకారుడని, ఆయన జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకుని నేడు జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి పగడాల అఖిల్, మండల సహాయ కార్యదర్శులు బరగడ రమేష్, పసుపులేటి పవన్, రేగిముడి పుల్లారావు, దర్శనాల ప్రశాంత్, గంజి మధు, కిరణ్, వంశి, కార్తీక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: