మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ ఆరు శాతం నుండి 10 శాతం పెంపు జీవో విడుదల చేయడం శుభ పరిణామనే టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తెలిపారు మండల పరిధిలోని ఎంపీపీ కార్యాలయంలో గిరిజన ప్రతినిధుల జరిగిన సమావేశంలో ఎంపీపీ రేసు లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గిరిజన ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ 10 శాతం పెంచడం ఆనందంగా ఉందని అన్నారు గత మూడు సంవత్సరాల క్రితమే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కానీ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ పెంపుపై వెనక తగకుండా జీవో నెంబర్ 33 అమలు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా గిరిజన ప్రజా ప్రతినిధులు తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు జడ్పిటిసి సీతమ్మ గిరిజన మహిళ ప్రజా ప్రతినిధులు జ్యోతి సీత కృష్ణవేణి వరలక్ష్మి జయలక్ష్మి సుమిత్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయసింహ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: