మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని వలస ఆదివాసీ గ్రామం తిర్లాపురంలో పోడు భూముల సర్వే జరిగింది. ఈ సర్వేను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, అమరారం పంచాయితీ ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, బీట్ అధికారి ఉపేందర్ లు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, పోడు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందుతాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి పోడు రైతుకు న్యాయం చేయాలని ఉద్దేశంతో సర్వే జరిపిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మల వెంకన్న, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, మడవి రమేష్, పోడు సాగుదారులు పాల్గొన్నారు.
Post A Comment: