మన్యం న్యూస్,పినపాక:గ్రామీణ వైద్యులుపరిధికి మించి వైద్యం చేయొద్దు అని ఆ సంఘం మండల అధ్యక్షులుఎంవీఆర్ ఎస్ వర్మ అన్నారు. ఆయన ఆదివారం
గ్రామీణ వైద్యులు సహాయ సంఘం ఆధ్వర్యంలో వర్మ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపి వైద్యులందరు పరిమితిని మించి వైద్యం చేయకూడదని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, కేవీ లాజరస్, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ యగ్గడి శ్రీరామ్ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు , సత్య లింగం రాంబాబు లను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జిమ్మిడి శివశంకర్, ప్రధాన కార్యదర్శి కోడం నరసింహారావు, ప్రచార కార్యదర్శి వరికిల్ల శ్రీనివాస్, కోశాధికారి శ్యామల సతీష్ ,చింత పండు సత్యం , చల్లగుండ్ల నరసింహారావు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: