CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత : ఏఎస్పీ రోహిత్ రాజ్.. ఆర్లగూడెం గ్రామంలో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

Share it:


  •  పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత : ఏఎస్పీ రోహిత్ రాజ్.
  • ఆర్లగూడెం గ్రామంలో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

మన్యం న్యూస్, దుమ్ముగూడెం ,అక్టోబర్ 23::

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నాడు దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఆర్లగూడెం,ఆశ్రమ పాఠశాల నందు మండల ప్రజల కొరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.నిపుణుల వైద్య బృందంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 500 మంది హాజరయ్యారు.దుమ్ముగూడెం మండలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.అనంతరం ఏఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ రోజు మనమంతా స్వేచ్చా వాయువులను ప్రశాంతంగా పీల్చుకోగలుగుతున్నామని అన్నారు.నిత్యం ప్రజల రక్షణకై,సమ సమాజ స్థాపన కొరకు పాటుపడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.ఇందులో భాగంగానే దుమ్ముగూడెం మండల ప్రజల కొరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కృషి చేయడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం సిఐ రమేష్,ఎస్సైలు రవి,కేశవ వైద్య బృందాన్ని ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి స్థానిక సర్పంచ్ కొరస సునీత టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాముడు వైద్య బృందం డాక్టర్ లోకేష్ అక్కినేని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: