బూర్గంపహాడ్ , మన్యం న్యూస్ , అక్టోబర్ 23 : బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు మొరంపల్లి బంజర్ లోని ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశనికి బూర్గంపహాడ్ మండల ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు వలదాసి సాలయ్య ముఖ్య కార్యదర్శిదాసరి కాంతారావు పాల్గొన్నారు. గ్రామ అధ్యక్షులుగా బర్ల బాబు ఉపాఅధ్యక్షులు గా దార సూర్యకిరణ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ బాగా అధ్యక్షులు మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితులకు వరం లాంటిదని దీన్ని రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేసి దళితులను ఉన్నతమైన మార్గంలో నడిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంటుందని అన్నారు.సమావేశంలొ పార్టీ గ్రామ ఉపాఅధ్యక్షులు శనగ బాబు బొజ్జ ప్రసాద్ శనగ అప్పారావు పిల్లి లాలయ్య పొందు చిట్టి బాబు తదితరులు పాలుగోన్నారు.
Navigation
Post A Comment: