CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవుల నుండి ఆదివాసులను వేరు చేయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది

Share it:


మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ (12) : అడవుల నుండి ఆదివాసీలను దూరం చేసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నీవు డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు. బుధవారం గుండాల,లింగగూడెం, రోల్లగడ్డ, పంచాయతీల్లో 14వ తారీకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ, అమిత్ షా అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ చట్టం తీసుకువస్తే దేశంలో ఉన్న 40 కోట్ల ఆదివాసులకు నష్టం వాటిల్లి ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమర్, సారంగపాణి, వై వెంకన్న, నరేష్ , మంగన్న, రియాజ్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: