మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్ నందు బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ప్రజాప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ,అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని,సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతులు రాజులు కావాలని సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించారని అన్నారు ,ప్రజలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్ని వర్గాల ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ప్రత్యేక పథకాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.దళిత బంధు పథకంతో దళితుల జీవితాలలో నూతన కాంతులు వచ్చాయని అన్నారు.పోడు రైతులకు హక్కు పత్రాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు .
బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: