మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ (23) : ప్రజల సమస్యలపై గల మెతుతోనే ప్రజలకు అండగా నిలుస్తామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఫయీమ్, సతీష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన పరమ శేఖర్ దశదినకర్మకు హాజరై ఆళ్లపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్రజల సమస్యలపై కథనాలు రాస్తూ సమస్యలుఅధికారులకు చేరే విధంగా కృషి చేస్తూనే సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను ఇబ్బంది పడుతున్న లెక్కచేయకుండా మెరుగైన వార్తలను అందించడం కోసం ముందుండే వాడే పాత్రికేయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు బోడకుంట బిక్షం, పరమ ప్రభాకర్, బూరుగడ్డ సత్యనారాయణ, కాసబోయినా వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి శ్రవణ్ కుమార్, కోతి చంద్రశేఖర్, మందలోజు సదానంద చారి, మహమ్మద్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: