CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారామ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీట మునిగిన మిరప చేను....

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ : మండల పరిధిలోని మద్దుకూరు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సీతారామ ప్రాజెక్ట్ కాలువకు ఇరువైపులా మట్టి ఎత్తు పెంచడం వలన చింతల రమణ అనే రైతు తనకున్న మూడు ఎకరాల మిరప చేను నీట మునిగిపోయింది. దీనికి కారణం సీతారామ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్ని రైతు చింతల రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మూడు సంవత్సరాల నుండి  ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఎన్నిసార్లు సీతారాం ప్రాజెక్టు అధికారులకు సమస్య చెప్పిన పట్టించుకునేటట్లు లేరని, వర్షాకాలం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వర్షాకాలంలో పైనుండి వస్తున్న వరదను సీతారామ కాలువపై  చాప్ట కట్టి నీరు మళ్లించాల్సింది పోయి, చాప్ట కట్టకుండా సీతారామ ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేశారు. ఈ సమస్య పక్క గ్రామమైన బెండాలపాడు లో కూడా తీవ్ర స్థాయిలో ఉంది. గత సంవత్సరం క్రితం బెండాలపాడు గ్రామస్తులు సీతారామ ప్రాజెక్టు పనులను అడ్డగించగా, సీతారామ ప్రాజెక్టు అధికారులు వచ్చి చాప్ట నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాన, ఇంతవరకు సంబంధిత అధికారులు వచ్చి చూసిన పరిస్థితి లేదని రైతులు,గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్ కాలవ ప్రక్కన మిరప తోట వేసిన చాలామంది రైతులు, సీతారామ ప్రాజెక్టు అధికారుల వల్ల చాలా నష్టపోతున్నారని, చివరకు మన జిల్లా కలెక్టర్  స్పందించి సమస్యను పరిష్కరించాలని, మద్దుకూరు, బెండాలపాడు గ్రామానికి చెందిన  రైతులు, గ్రామస్తులు కోరుకుంటున్నారు

Share it:

TELANGANA

Post A Comment: