మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గోపాలమిత్రులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సరైన వేతనాలు లేక ఎంతోకాలం నుంచి ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పిఆర్సి ప్రకటించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనాలు పెంచడంతో గోపాల మిత్రలు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామాలలో పశుసంపద అభివృద్ధి కోసం విస్తృతంగా సేవలు అందిస్తున్న తమ శ్రమను గుర్తించిన కేసీఆర్ , పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రపటాలకు జిల్లా అధ్యక్షుడు రాజారావు ఆధ్వర్యంలో ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.అనంతరం గోపాల మిత్ర తాతేనేని గోపాలకృష్ణ మాట్లాడుతూ 30% పిఆర్సి ప్రకటించడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు కోడి రెక్కల సుమన్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: