మన్యం న్యూస్ అక్టోబర్ 06:
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో వాజేడు మండలంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ కు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు పే స్కేల్ జీవో అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్, వయస్సు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. హామీని నెరవేర్చి జీవోలను విడుదల చేసేంతవరకు శాంతియుతంగా ఈ నిరవధిక సమ్మెను ముందు కు కొనసాగిస్తాము. ఈరోజు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ నిరవధిక సమ్మె దీక్షలు 74వ రోజుకు చేరింది. ఇట్టి సమ్మె అన్నీ మండలాల్లో వీఆర్ఏల నిరవధిక సమ్మెదీక్ష శిభిరల వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి 23 వేల మంది వీఆర్ఏల కుటుంబాలు పస్తులతో సుమారు మూడు నెలల నుండి జీతభత్యాలు లేక కరువుతో అప్పులతో అలమటిస్తున్నారు. కనీసం ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగులైన విఆర్ఏల మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మా కుటుంబాలను ఆదుకోవాలని ప్రాధేయ పడుతూ వేడుకుంటున్నాము.వీఆర్ఏల 74వ రోజు నిరవదిక సమ్మె వద్ద డిమాండ్స్ ప్లకార్డ్స్ పట్టుకొని శాంతియుతంగా నిరసనలు
తెలియపరచలైనది.74వరోజు
నిరసనలో వాజేడు మండల వీఆర్ఏలు అధ్యక్షులు కుందమల్ల సురేష్,గజ్జల రాంబాబు,కుందమల్ల నాగరాజు, వేల్పుల ఉదయ,జాడి తిరుపతి,కావిరి బాలచంద్రమూర్తి,సమీర్, కాట తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: