జూనియర్ కళాశాల సెంటర్ లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిషేకం జరిపి నూతన వస్త్రాలు స్వర్ణ ఆభరణాలు అలంకరించారు. ఆలయంలో పూల అలంకరణ జరిగిందని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.
శ్రీ సాయి బాబా వారికి త్వరలో చేయించనున్న స్వర్ణ రుద్రాక్షమాల కు పెనుబోతుల మనోహర్ సౌమ్య శ్రీ దంపతులు 21 వెయ్యి విరాళాన్ని ఆలయ ఉపాధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ కోశాధికారి కుంచాల రమేష్ లకు అందజేశారు.
విరాళం అందించిన దాతను శాలువా తో సత్కరించారు.
సాయంత్రం ఆలయంలో దీపాలు వెలిగించారు. బాబా వారికి మరో నూతన వస్త్రాలు అలంకరించారు. ప్రసాదం నివేదన జరిపారు. బాణసంచా కాల్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: