మన్యం న్యూస్,అశ్వాపురం:
మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను శుక్రవారం నాడు అశ్వాపురం మండలం సండ్రల బోరు గ్రామానికి చెందిన శ్రీ నాగులమ్మ మహా జాతర నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి సండ్రల బోరు గ్రామంలో ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు జరిగే శ్రీ శ్రీ బండ్ల సిరిగుట్ట మీద వెలసి ఉన్న శ్రీ నాగులమ్మ మహా జాతర హాజరు కావాల్సిందిగా కోరుతూ నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది, అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నాగులమ్మ మహా జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: