- ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు
- ఆదివాసుల ఆరాధ్యదైవం కొమురం భీమ్..
- కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి...
- ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షుడు పోడియం అనిల్ ..
మన్యం న్యూస్,అశ్వాపురం(అక్టోబర్22):
అశ్వాపురం మండల కేంద్రం చింతిర్యాల క్రాస్ రోడ్డులో ఆదివాసుల ఆరాధ్య దైవం మాన్యశ్రీ కొమురం భీమ్ జయంతి వేడుకలను శనివారం నాడు ఘనంగా నిర్వహించారు..ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షులు పోడియం అనిల్ కుమార్ అధ్యక్షతన కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆదివాసీ భవన్ కార్యాలయం వద్ద జరిగిన జయంతి వేడుకల కార్యక్రమంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ....ఆనాడు కొమరం భీమ్ నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసుల జీవన ఉపాధి కోసం భూమి కోసం భుక్తి కోసం ఆదివాసి హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో వారిపై ఉద్యమ పోరాటం చేస్తూ సమస్త ఆదివాసి ప్రజల కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి అమరుడైనాడు అని అన్నారు. ఆదివాసీలు ధైర్యంగా క్షేమంగా బ్రతుకుతున్నారంటే కొమరం భీం వల్లేనని ఆదివాసీల పట్ల ఆయన ప్రాణ త్యాగం ఆయన పోరాటం మరువలేనిదని,భీమ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో మండల ఆదివాసి నాయకులు బట్ట సత్యనారాయణ (బట్టిల గుంపు సర్పంచ్), బోడిక వెంకటేశ్వర్లు, చాప ముత్తయ్య, పొడియం సుజాత (గొల్లగూడెం సర్పంచ్) కల్లూరి నరసింహారావు, కోరెం రామారావు,తెల్లం వెంకటేశ్వర్లు,ఊకె నాగరాజు,యలకం నాగార్జున,వర్సా వీరస్వామి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: