CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యల పరిష్కారమే లక్ష్యం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం న్యూస్,మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటపతి నగర్, మద్దులగూడెం, సీతానగర్, రాంనగర్ గ్రామాలలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు శనివారం నాడు పలు శాఖల ప్రభుత్వ అధికారులు, BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది...


👉 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ  


👉 ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఆయన అన్నారు, కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు, సమస్యలను ఆయా శాఖ అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మాట్లాడేందుకు ప్రజల వద్దకు వచ్చినట్లు ఆయన తెలిపారు, అదేవిధంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరుతున్నాయి అన్నారు, గత ప్రభుత్వాలు గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు, పినపాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు, మౌలిక వసతుల కార్యాచరణ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు, అదేవిధంగా మిగిలినటువంటి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: