మన్యం న్యూస్ ,జిల్లా ప్రతినిధి, అక్టోబర్02... దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని దేశ స్వాతంత్రం కోసం బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయం గా నిలిచిపోయాయని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఎమ్మెల్యే స్వగృహంలో 153వ గాంధీజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశ స్వాతంత్రం సంపాదించిన ఘనత మహాత్మా గాంధీ కే దక్కిందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బరపటి వాసుదేవరావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్, రాంబాబు, బొడ గణేష్, సముద్రాల వెంకటేశ్వర్లు, ఏనుగుల శ్రీను, బ్యాంకు చారి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: