CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే మెచ్చా ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్ర అయినా అశ్వరావుపేటలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారనీ. కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారనీ, ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు అని ఆయన అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి అని, అయినా వాటన్నింటనీ అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారాడనీ, బ్రిటీష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ వంటి ఉద్యమాలు ఎన్నో చేశారనీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచులు అట్టం రమ్య, సాదు జోత్సా బాయ్, మండల నాయకులు రాజా మోహన్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: