మన్యం న్యూస్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ మొండికుంట గ్రామ ఆవరణలో మరియు కొత్త గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న గాందీ విగ్రహాలకు పూలమాల వేసి గాందీజీ సేవలను స్మరించుకొన్న సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించి గత నెల రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు గ్రామ ప్రజలకు తెలియ జేయడం జరిగింది.బతుకమ్మ ,దసరా పండుగ కు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడవరపు సుదీర్,ఎంపీటీసీ కమటం నరేష్, సెక్రటరీ సైదులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: