మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (15) మండలంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు వెల్లువల కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ సారథ్యంలో శనివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి. మండలం పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన 20 కుటుంబాలు రేగా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ విప్ రేగా నాయకత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని గుండాల మండలానికి అత్యధికంగా నిధులు కేటాయించి అభివృద్ధిని ముందడుగులో తీసుకుపోతున్న దానికి ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య,బీసీ మండల అధ్యక్షులు గడ్డం రమేష్ , పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి,వట్టం రవి, లాలయ్య, గోగ్గల లక్ష్మీనారాయణ, సనప కృష్ణ , పార్టీలో చేరిన వారు గోగ్గల నరసయ్య,గోగ్గల రామస్వామి, జోగా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: