మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఆవరణలో ఈనెల 17న నిర్వహించనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సు(కోర్టు)కు వినియోగదారులు విధిగా హాజరు కావాలని సీజీఆర్ఎఫ్ చైర్మన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోదారుల సమస్యలు పరిష్కరించేందుకు సోమవారం(17)నలోకల్ కోర్టు ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోదారుల ఫోరం చైర్మన్ పేర్కొన్నారు. ఈలోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్దరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల లోపాలు ఉన్న మీటర్లు మార్చటం, నూతన సర్వీసుల మంజూరుపై ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అలాగే అదనపు లోడ్ క్రమబద్దీకరణ, సర్వీసు పేరు మార్పు, వాడకాన్ని కన్న హెచ్చ మొత్తంలో గల బిల్లులు రావడం, కేటగిరి మార్పు సర్వీసు రద్దు ఇలా సమస్యలను ఈ కోర్టులో తెలిజేయాలన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫిర్యాదులు ఉదయం 10.30ల నుంచి మద్యాహ్నం ఒంటిగంట స్వీకరించడం జరుగుతుందన్నారు. సమావేశానికి టెక్నికల్ సభ్యుడు తిరుమల్, పైనాన్స్ సభ్యులు చరణ్దాస్, ఇండిపెండెంట్ సభ్యులు నరేందర్ హాజరవుతారన్నారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల విద్యుత్ వినియోగదారులు హాజరు కావాలని ఆయన కోరారు.
Post A Comment: