మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న అందరికీ పట్టాలకు అర్హులను చేయాలని ఉద్దేశంతో గత ఆరు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పొడు భూముల సర్వేను చేస్తుంది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం పంచాయతీలోని పోడు భూముల సర్వేలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ పాల్గొన్నారు. అమరారం పంచాయితీ ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, పంచాయతీ సెక్రటరి వెంకటేశ్వర్లు, అటవి శాఖ అమరారం బీట్ అధికారి ఉపేందర్, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ ల బృందంతో కలిసి శుక్రవారం నాడు సర్వేలో పాల్గొన్నారు. పోడు సాగుదారుల వివరాలను సేకరిస్తూ, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ సర్వే కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, ఇప్పటివరకు అమరారం పంచాయతీలో రెండు వందల ఎకరాలకు పైగా పోడు భూమి సర్వే జరిగిందని, అర్హులను గుర్తించామని తెలియజేశారు. మరి కొన్ని రోజులలోనే సర్వే పూర్తవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ సి కమిటీ సభ్యులు, పోడు సాగుదారులు, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు, అమరారం పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: