మన్యం న్యూస్ ,చర్ల :
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును 'భారత్ రాష్ట్ర సమితి' గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానానికి హర్షం వ్యక్తంచేస్తూ చర్ల మండల తెరాస పార్టీ కార్యాలయం వద్ద ప్రధాన కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి నినాదలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, పిఎసిఎస్ డైరెక్టర్ ముమ్మనేని అరవింద్, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస రెడ్డి, చర్ల టౌన్ అధ్యక్షులు ముమ్మనేని సత్య సంపన్, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, రైతు బందు క్లస్టర్ తోటపల్లి మాధవరావు, మండల కమిటి సభ్యులు, నాయకులు తోటమళ్ళ రవి, కొంబత్తిని రాము, కొంగురు రాజా, యూత్ తడికల బుల్లబ్బాయి, రావుల కిషోర్, ఉద్యమ నాయకులు మహబూబ్ పఠాన్, గోరింట్ల వెంకన్న పాల్గొన్నారు.
Post A Comment: