మన్యం న్యూస్:గుండాల/ఆళ్లపల్లి (05) టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందిన సందర్భంగా మండలంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. మండలం పరిధిలోని మార్కోడు గ్రామంలో పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో దూసుకుపోయిన విధంగానే బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా దూసుకుపోతుందన్నారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు,పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సర్పంచ్ శంకర్ బాబు, నాయకులు ఆదాం, కీసరి నరేష్ , కంచర్ల సందీప్, మద్దెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: