CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వాపురంబస్టాండ్ లోకి బస్సులు రాకతో కొత్త కళ

Share it:


మన్యం న్యూస్,అశ్వాపురం:మండల పరిధిలోని అశ్వాపురం తాసిల్దార్ కార్యాలయం సమీపంలోఉన్న  ఆర్టీసీ బస్టాండ్ లోకి కొన్ని సంవత్సరాలుగా బస్సులు రాక పోవడంతో కలతప్పి శిధిల వ్యవస్థలోకి చేరుకుంది. అశ్వాపురం మండల కేంద్రం కావడంతో వందలాదిమంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు .ప్రయాణికులకు మూత్రశాలలు మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్న తరుణంలో  టి ఎస్ ఆర్ టి సి సోమవారం నుండి బస్టాండును పున ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు బస్సుస్టాండ్ లోకి చాలా సంవత్సరాల తర్వాత రావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండల  టిఆర్ఎస్ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితోనే అశ్వాపురం బస్టాండ్ లో బస్సులను పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే రేగాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం బస్టాండ్ లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: