CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ అభివృద్ధి పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి టీఆరెస్ మండల యువజన విభాగం ఇన్చార్జి బొశెట్టి రవి ప్రసాద్

Share it:




మన్యం న్యూస్,పినపాక:

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి జిల్లా బీ ఆరెస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండల దుగినేపల్లి గ్రామ యువజన విభాగం సమావేశం సోమవారం దుగునపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం యువజన విభాగం మండల అధ్యక్షులు గాండ్ల అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య అతిథి బోశెట్టి హాజరై మాట్లాడారు. యువత టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాలను గడపగడపకు ప్రచారం చేయాలన్నారు. అనంతరం దుగ్గినపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో నూతన యువజన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. దుగినేపల్లి గ్రామ యువజన విభాగం అధ్యక్షులుగా కందిమల్ల నరసింహారావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో  పినపాక నియోజకవర్గ టీఆరెస్ యూత్ ప్రధాన కార్యదర్శి బానోతు రమేష్, దుగినపల్లి గ్రామ అధ్యక్షులు పోకల రాజాపతి,యగ్గడి సత్యనారాయణ, ఆకుల హుస్సేన్, అండే వెంకటరెడ్డి, బిల్లం సాంబశివరావు, బత్తుల చిన్న లక్ష్మీనారాయణ, అండే నాగిరెడ్డి,మొదలగు పార్టీ నాయకులు,మరియు దిగినేపల్లి గ్రామ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: