మన్యం న్యూస్,అశ్వాపురం(అక్టోబర్31):
అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అశ్వాపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక సంస్కరణలతో ముందుకు నడిపించిన ఉక్కు మహిళగా, ఓటమి ఎరుగని వీరవనితగా, గరీబ్ హటావో అనే నినాదంతో 20 సూత్రాల ఆర్థిక పథకంతో భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ ,ప్రాజెక్టుల నిర్మాణాలు, తదితర కార్యక్రమాలతో పేదరికం పారదోలే పథకాలు రూపొందించి యావత్ భారతావని మన్ననలు పొందిన ప్రధానిగా ఆమె చరిత్రకు ఎక్కడ జరిగింది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య ,బీసీ సెల్ బచ్చు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు మచ్చ నరసింహారావు,నాయకులు గొడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: