మన్యం న్యూస్, పినపాక: గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ప్రకటించడం చాలా ఆనందదాయకమని, గిరిజనులందరం ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శనివారం నాడు ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత బంధు మాదిరిగానే భవిష్యత్తులో ప్రభుత్వం గిరిజన బంధువు ప్రవేశపెట్టడం అదేవిధంగా ప్రస్తుతం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని తెలియజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలంలోని ఎంపీటీసీలు పంచాయతీల సర్పంచులు, ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: