మన్యం న్యూస్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనులకు ప్రకటించిన 10% రిజర్వేషన్ ఇచ్చిన మాట ప్రకారం జీవో విడుదల చేయడంపై గిరిజనులు గిరిజన ప్రజాప్రతినిధులు ఆదివాసీ నాయకులు శనివారం నాడు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులురేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కొర్శా దుర్గారావు ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల సర్పంచ్ సంఘాల అధ్యక్షులు సున్నం రాంబాబు, కుంజా రామారావు, పాయం భద్రయ్య, పరిశిక రాజమ్మ, కాక అశోక్, సోయం శ్రీను, ఎక్స్ ఎంపిటిసి పాయం సత్యనారాయణ, లకావత్ రామారావు, బానోత్ చంద్రు, బానోత్ శంకర్, తాటి మోహన్ కృష్ణ, గుర్రాల రమేష్ ,సోడా నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: