భద్రాచలం 01 అక్టోబర్ 22. :
అటవీ హక్కు చట్టం యొక్క నియమ నిబంధనల ప్రకారం జిపి ద్వారా గ్రామాలలో సర్వే చేసిన పోడు భూముల యొక్క దరఖాస్తులు తప్పులు లేకుండా సక్రమమైన పద్ధతిలో విచారణ చేయాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఎఫ్ఆర్ఓలు, మరియు ఎంపీవోలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2021 లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ ద్వారా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను సర్వే చేయుటకు గాను దిశ నిర్దేశం వారికి చేశారు. సోమవారం నుండి తప్పనిసరిగా గ్రామాలలో పూర్తిస్థాయిలో సర్వే చేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేయాలని, సంబంధిత నోడల్ అధికారులకు ఆదేశించారు. సర్వే కి సంబంధించిన రికార్డు ఫారంలను ఐటిడిఏ కార్యాలయం నుండి తీసుకోవాలని, సంబంధిత ఎంపీడీవోలకు ఆదేశించారు. పోడు భూములకు సంబంధించిన సర్వే చాలా చాలా బాధ్యతగా చేయాలని, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నది ఉన్నట్టు రికార్డులో పొందుపరచాలని, అందుకు సంబంధిత నోడల్ అధికారులు, తాసిల్దారులు, ఎంపీ ఓలు ,ప్రత్యేక బాధ్యతగా వ్యవ
Post A Comment: