మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
ఏటూరు నాగారం మండల కేంద్రంలో మానసపల్లి కాలనీకి చెందిన ఏటూరు నాగారం గ్రామపంచాయతీ లో పనిచేసే సఫాయి చింత రవి కొద్ది రోజుల క్రితం మరణించగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో చింత రవి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం తో పాటు 3500/రూపాయలు నిత్యవసర సరుకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయుబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస
వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు,జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్,కన్నాయి గూడెం జడ్పిటిసి నామకరం చందు గాంధీ,ఎంపీటీసీ సభ్యులు గుడ్ల శ్రీలత దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్,టౌన్ అధ్యక్షులు ఎండి సులేమాన్, వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,మామిడి రాంబాబు, గుండెల శ్రీనివాస్,పడిదల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: