మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి శుక్రవారం అనారోగ్యంతో ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ ను పరామర్శించిన ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి అనంతరం ముంజల బిక్షపతి గౌడ్ ను పరామర్శించిన అనంతరం కొప్పుల రవి మాట్లాడుతూ.ముంజల బిక్షపతి గౌడ్ తొందరగా కోలుకోవాలని మా ఆదివాసుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ వనదేవతలను కోరుకున్నట్లు కొప్పుల రవి అన్నారు.అనంతరం ముంజల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ. కొప్పుల రవి మారుమూల ఏజెన్సీ గ్రామం కాల్వపల్లి నుండి పరామర్శించడానికి రావడం నాకు ఆరోగ్యం బాగు పడినట్లు అయిందని బిక్షపతి అన్నారు వారి రుణం తీర్చుకోలేనిదని బిక్షపతి అన్నారు.నాకోసం ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఉద్యమకారులు రావడం నేను ఆరోగ్యంగా కోరుకున్నట్లేనని బిక్షపతి అన్నారు.కొంతమంది దూర ప్రాంతాల నుండి ఫోన్లలో పరామర్శిస్తున్నారని వారిని కూడా మర్చిపోనని ముంజల బిక్షపతి అన్నారు.నా మీద ప్రేమతో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నని,త్వరలోనే కోలుకుంటానని ముంజల బిక్షపతి అన్నారు.
Post A Comment: