ఎస్సై నిర్లక్ష్యం?
*మైనర్ బాలిక తల్లి ఆత్మహత్య...
*మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..
మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి( అక్టోబర్ 30) : మండల పరిధిలో గల తాటి బుచ్చన్న గూడెం గ్రామానికి చెందిన తాటి వెంకటరమణ రాత్రి 10:30 సమయంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.... మర్రిగూడెం గ్రామపంచాయతీ మర్రిగూడెం గ్రామానికి చెందిన కాక వీర రాఘవులు అనే వ్యక్తి మృతురాలు పెద్ద కుమార్తె అయిన రమాదేవిని పత్తి తీస్తుండగా బలత్కరించడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రమాదేవి కేకలు వేయగా, చుట్టు ప్రక్కల అదే గ్రామానికి చెందిన రైతులు, కూలీలు పట్టుకొని కుల పంచాయతీ చేస్తుండగా ఎస్సై విజయ అక్కడికి వచ్చి నిందితుడు కాక వీర రాఘవులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళింది. మృతురాలు కుటుంబ సభ్యులు స్టేషన్కు వెళ్లి నిందితుడు గురించి అడగ్గా పిలిపిస్తున్న పిలిపిస్తున్న అని ఐదు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటు, నిర్లక్ష్యం చేయగా, రమాదేవి తల్లి మనస్థాపానికి గురై పురుగులు మందు తాగి ఆత్మహత్య చేస్తుంది. మృతురాలు కుటుంబ సభ్యులు,బంధువులు కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఎస్సై విజయ నిర్లక్ష్యం కారణంగానే తాటి వెంకటరమణ మృతి చెందిందని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతురాలి భర్త తాటి వెంకటేష్ ఫిర్యాదు మేరకు సిఐ వసంత్ కుమార్ ఫిర్యాదు తీసుకొని విచారణ చేసి దానికి సంబంధించిన వ్యక్తులను అధికారుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన విరమించి, నిందితులను శిక్షించి, వారిపై చర్యలు తీసుకోవాలని,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కోరారు.
Post A Comment: