జూలూరుపాడు, అక్టోబర్ 29, (మన్యం న్యూస్): మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వందనపు సత్యనారాయణ ను శని వారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, పెండ్యాల విజయభాస్కర్, కొదుమూరి శ్రీనివాసరావులు పరామర్శించారు. హైదరాబాదు ఆసుపత్రి నుండి చికిత్స అనంతరం తిరిగి వచ్చిన ఆయనను కాకర్ల వెళ్లి పరామర్శించి, దాడికి సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు కంభంపాటి రమేష్, ధారా రమేష్, కొత్తగూడెం పట్టణ సంఘం అధ్యక్షుడు పల్ల పోతు సాయిబాబా, మొర్రిశెట్టి భవాని ప్రసాదు, పసుమర్తి అనంతం, చుంచుపల్లి మండల అధ్యక్షుడు తమ్మిశెట్టి రమేష్, కార్యదర్శి, దాచేపల్లి పిచ్చయ్య, మండల ఆర్యవైశ్య ప్రముఖులు పెండ్యాల రామనరసింహారావు, కొదుమూరి మల్లికార్జునరావు, కొదుమూరి రమేష్ , కంచర్ల రామారావు, పెండ్యాల రాజశేఖర ( ఎంపీటీసీ ) ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పెండ్యాల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి తొండెపు సుబ్బారావు, కోశాధికారి కోదుమూరి భాను ప్రకాష్, పట్టణ సంఘం అధ్యక్షుడు ఉడతా పూర్ణచంద్రరావు, పెండ్యాల సత్యనారాయణ, వుడతా వెంకటేశ్వర్లు, వేముల గురునాథం, వందనపు రాఘవులు, వందనపు నరసింహారావు, ఉడతా వెంకటేశ్వరరావు, వందనపు రామారావు తదితరులు ఉన్నారు.
Post A Comment: