మన్యం న్యూస్, అక్టోబర్ 30, వాజేడు .:
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ నీ పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి అశోక్ కుమార్, మాట్లాడుతూ భారతదేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కొరకు పోలీసులు కృషి ఎనలేనిది అని ఆయన అన్నారు. సమాజంలో ప్రజలకు పోలీసులకు, విడదీయలేని అభినవ భావ సంబంధం ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కాదు ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహించాలన్నారు. గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేయాలని సూచించారు. ఏ ఎస్ పి అశోక్ కుమార్ నూతనంగా పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: