మన్యం న్యూస్,అశ్వాపురం: అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ మండల యువజన విభాగం సమావేశం నిర్వహించనున్నట్లు మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమావేశానికి పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు, అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి మట్టపల్లి సాగర్ యాదవ్ హాజరు కానున్నారని యువజన నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని మండల యువజన విభాగం సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Navigation
Post A Comment: