మన్యం న్యూస్ : జూలూరుపాడు, (అక్టోబర్ 8) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన నీలాల కిషిందరావు అనే వ్యక్తి కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం సమయంలో కిషిందరావు ఇంట్లోకి తినుబండరాల కోసం కోతులు ప్రవేశించగా వాటిని బయటికి వెళ్లగొడుతున్న క్రమంలో కోతులు కిషిందరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని తెలిపారు. తీవ్ర గాయాలైన కిషిందరావును వెంటనే వారి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అన్నారు. వెంగన్నపాలెం గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతుందని, ఏమాత్రం హేమరపాటుగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లయితే వెంటనే ఇండ్ల లోకి చొరబడి వస్తువులు, వంట సామాగ్రిని చిందర వందల చేస్తున్నాయని తెలిపారు. చిన్నపిల్లలు బడులకు వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. కిరాణా దుకాణాల నుండి ఏదైనా వస్తువుల కవర్ చేత పట్టుకొని వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కోతులు ఇలా మనుషులపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. మండల కేంద్రంలో కోతుల బెడదను కట్టడి చెయ్యాలని, స్థానిక ప్రజాప్రతినిధులను, మండల అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Navigation
Post A Comment: