మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ: మండల పరిధిలోని ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... సీతయ్య గూడెం గ్రామానికి చెందిన కొండ్రు రవి (36) పక్క గ్రామమైన రాంపురానికి దుక్కి దున్నటానికి ట్రాక్టర్ పై వెళ్లి వస్తుండగా మహమ్మద్ నగర్ గ్రామ శివారు ప్రమాదవశాత్తు డాక్టర్ బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై విజయలక్ష్మి చేరుకొని దర్యాప్తును చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, సంతానం కలరు
Navigation
Post A Comment: