మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం జమ్మిగూడెం గ్రామంలో దేవీ నవరాత్రులు బతుకమ్మ సంబరాలు సందర్భంగా మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబరాల్లో అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ పాల్గొన్నారు. జారే ఆదినారాయన్ని సాలువాతో సత్కరించి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో ప్రత్యేక ఆలయంలో కొలువు దీరిన శ్రీ దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆడపడుచులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. ఈ సందర్భంగా జారా ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామస్తులందరికీ విజయదశమి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అమ్మ వారి ఆశీస్సులతో గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిద్దెన కొండయ్య, వార్డ్ మెంబర్స్ దానపు జగపతి, మిద్దెన రాంబాబు, రాజిని నాగేశ్వరావు, యువకులు దాది చంటి, దండి వెంకటేష్, తోట ముక్తేశ్వరావు, గ్రామ మహిళలు, యువతి యువకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: