అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే మెచ్చా -మెచ్చా స్వగృహంలో మెచ్చా దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ సాదు జోత్స్నా భాయ్ -విజయదశమి సందర్భంగా మెచ్చా దంపతులను తల్లిదండ్రులుగా భావించి నూతన వస్త్రాలను బహుకరించిన సర్పంచ్ సాదు జోత్స్నా భాయ్
మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాదు జోత్స్న బాయ్ తాటి సుబ్బన్న గూడెంలో ఎమ్మెల్యే మెచ్చ స్వగృహంలో మెచ్చా దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి సందర్భంగా మెచ్చా కి శుభాకాంక్షలు తెలిపి తల్లిదండ్రులు లేని తనకు మెచ్చా దంపతులు తల్లిదండ్రులుగా భావించి ఫోటో ప్రేమ్ మరియు నూతన వస్త్రాలను వారికి అందించినట్లు సర్పంచ్ సాదు జోత్స్నా భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోత్స్న మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే మెచ్చా అని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించే గుణం ఉన్న ఎమ్మెల్యే మెచ్చా అని తన తల్లి తండ్రి గా భావించి వస్త్రాలు బహుకరంచడం సంతోషంగా వుంది అని సర్పంచ్ సాదు జోత్స్నా బాయ్ అన్నారు.
Post A Comment: