మన్యం న్యూస్ , ఏటూరు నాగారం :
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని ఏడో వార్డుకు చెందిన జాస్తి శ్రీలతకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 28,500/ రూపాయల విలువగల చెక్కు, ఎనిమిదో వార్డుకు చెందిన పిన్నోజు విజయకు మంజూరైన 16,500 విలువగల చెక్కు,14వ వార్డుకు చెందిన గజ్జల రమేష్ కు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మరణించగా సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును భార్య గజ్జల స్వరూపకు అందజేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మాట్లాడుతూ.
పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ సభ్యత్వ నమోదు,ప్రమాద బీమా ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రమాదవశాత్తు పార్టీ కార్యకర్త చనిపోతే వారి కుటుంబ వీధిన పడకుండా ఉండడానికి కుటుంబానికి పార్టీ అండగా, ఇంటికి పెద్ద కొడుకుగా కేసీఆర్ ఇచ్చే బీమా చెక్కు మరణించిన వ్యక్తి ఇంటికి అండగా ఉంటుందని,ఆ కుటుంబం మంచి చెడులు పూర్తిగా పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా సునీల్ కుమార్ అన్నారు.ప్రమాద బీమా ద్వారా ఎంతో మంది కార్యకర్తల కుటుంబాలకు లబ్ధిచే కోరుతుందని పార్టీ కొరకు పనిచేస్తున్న కార్యకర్తలకు మనోధయాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి-సలీం, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ-నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సయ్యద్ సర్దార్ పాషా,ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,ఎంపీటీసీ సభ్యులు స్వప్న-చంద్రబాబు, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సప్పిడి రామనర్సయ్య,ఏటూరు నాగారం గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ దన్నపునేని కిరణ్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు వావిలాల రాంబాబు,గార ఆనంద్, బట్టు రమేష్, ఎండి ఆరిఫ్, పర్వతాల రమేష్, ఎండి అజ్మత్ ఖాన్, కందకట్ల శ్రీనివాస్, రంజిత్, కొండాయి చిన్ని, అటిక నాగేశ్వరరావు, పాలకుర్తి విజయ్, జాస్తి శ్రీకాంత్, కుమార్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: