గుండాల/ఆళ్లపల్లి, మన్యం న్యూస్ :(02) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆళ్లపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణంలో కలిశారు. ఆళ్లపల్లి మండలానికి భారీగా నిధులు కేటాయించారని పోరామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు పేర్కొన్నారు. ఈ విన్నపాన్ని మన్నించిన రేగా కాంతారావు భారీగా నిధులను కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. జల్లేరు వాగుపై సీతానగరం వద్ద 6 కోట్లతో వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేశారన్నారు. నడిమిగూడెం నుండి దొంగతో గు వరకు 70 కోట్లతో బిటి రహదారి వంతెనలు నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మర్కోడు గ్రామంలో ఎస్టి కమ్యూనిటీ హాల్ కొరకు 25 లక్షలు రేగళ్ల రోడ్డుకు గుట్టమీద సిసి రోడ్ రెండు వాగులపై కలవట్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ తినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భారీ ఎత్తున నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, పిఎసిఎస్ డైరెక్టర్ ఆఫీస్, టిఆర్ఎస్ యువజన విభాగ అధ్యక్షులు సతీష్ , ఆదాం, వెంకటేశ్వర్లు, శైల తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: