CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వచ్ఛ సర్వేక్షన్ లో.. భద్రాద్రి జిల్లా కు జాతీయ స్థాయి అవార్డు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చేత అవార్డు అందుకున్న కలెక్టర్ అనుదీప్

Share it:


మన్యం న్యూస్, జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02... పల్లెల తో పాటు పట్టణాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అనుదీప్ సారధ్యంలో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీజనల్ వ్యాధులు తలెత్తకుండా అధికారులందరినీ భాగస్వామ్యం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ప్రధానంగా కరోనా సమయంలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తం చేసి సమస్యాత్మక ఉన్న గ్రామాలు పట్టణాలపై దృష్టి సారించి చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి కరోనా వ్యాధి బారిన ప్రజలు పడకుండా జిల్లా యంత్రాంగం శక్తివంచన లేకుండా పని చేసింది. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఇటీవల ప్రత్యేక బృందం భద్రాద్రి జిల్లా లో పర్యటించి పూర్తిస్థాయి వివరాలను నమోదు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు జాతీయ స్థాయిలో అవార్డును అందజేసింది.


కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ అనుదీప్

ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ అవార్డును కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అందుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మధుసూదన్ రాజు జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: