హైదరాబాద్ : మన్యంన్యూస్ డిజిటల్ టాబ్లాయిడ్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదివారం ప్రారంభించారు. గాంధీజయంతి సందర్భంగా డిజిటల్ డైలీ ని ప్రారంభించగా, విజయదశమి నుండి అప్రతిహతంగా డైలీ కొనసాగనుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన మన్యం మనుగడ మాసపత్రిక ఏజెన్సీ ప్రాంతంలో అనేక సంచలనాలకు కేంద్ర బిందువు కాగా జాతీయ దృష్టిని ఆకర్షించింది. మన్యంటివి వెబ్ సైట్ స్థానిక వార్తలతో ప్రత్యేక ఒరవడిని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, నిజమైన వార్తలు అందించేందుకు మన్యంన్యూస్ ఈపేపర్ ను ఆదివారం ప్రారంభించారు. మన్యం న్యూస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
...
Post A Comment: