మన్యం న్యూస్, కరకగూడెం: మహాత్మా గాంధీ 153వ జయంతి పురస్కరించుకొని కరకగూడెం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ తెలంగాణ గాంధీ స్మారక నిధి రాష్ట్ర బోర్డ్ మెంబర్ చందా లింగయ్య దొర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో మహాత్మా గాంధీ పుట్టడం దేశ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.దేశంలోని ఆయన ఆలోచనలు విధానాలు ఆచార్య యోగ్యం అని తెలిపారు.స్వతంత్ర భారతదేశంలో అసమానతలు లేని దేశం కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకే నరసింహారావు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు, కరకగూడెం గాంధీ స్మారక్ మేనేజర్ నాగబండి.వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరిశెట్టి.కమలాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: