CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తాసిల్దార్ కార్యాలయాలనికి తాళాలు వేసిన వీఆర్ఏలు.

Share it:


మన్యం న్యూస్ కరకగూడెం: వీఆర్ఏల నిరవధిక సమ్మె నేటికీ 78 రోజులకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరకగూడెం తాహశీల్దార్ కార్యాలయంకు తాళాలు వేసి కార్యాలయాన్ని దిగ్బంధం చేసి,నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల వీఆర్ఏల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, నిరవధికంగా సమే చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పే స్కేలు ప్రకటించి వాటిని అమలు చేయాలని ఆయన అన్నారు. 23,000 మంది వీఆర్ఏల ఆకలి కేకలు ప్రభుత్వం చెవికి చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్ర భారతదేశంలో వీఆర్ఏల బతుకులు మారలేదని కనీసం బంగారు తెలంగాణలో నైనా తమ బతుకులు మారుతాయని ఆశపడితే తెలంగాణలో కూడా తమ బతుకులు మారడం లేదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏ నాయకులు ఆనందరావు నరేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: