CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ అధికారుల సేవలు మరువలేనివి.... బదిలీపై వెళ్తున్న విద్యుత్ అధికారులకు సన్మానం

Share it:


మన్యం న్యూస్, మంగపేట.

విద్యుత్తు అధికారుల సేవలు మరువలేనివని వారి బదిలీ బాధాకరమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. బుధవారం మంగపేట మండల పరిధిలోని రాజుపేట గ్రామంలో కమలాపురం సబ్ సెక్షన్ నుండి బదిలీపై వెళ్తున్న మంగపేట మండల విద్యుత్ ఏఈ ఆలేటి శ్రీధర్ మరియు అకినేపల్లి మల్లారం లైన్మెన్ పసుపులేటి రవి వీడుకోలు సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో అధికారులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఈ క్రమంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా మంగపేట మండలంలోని విద్యుత్ వినియోగదారులకు రాత్రి పగలు తేడా లేకుండా విశేష సేవలు అందించి వరంగల్ కి బదిలీపై వెళ్తున్న ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆలేటి శ్రీధర్ మరియు అకినేపల్లి మల్లారం లైన్మెన్ పసుపులేటి రవి సేవలను ఆయన కొనియాడారు అనంతరం, పూలమాలలు శాలువాలతో అధికారులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్తు అధికారులు ఏటూరు నాగారం ఎన్పీడీసీఎల్ ఏడి విజయరాజ్,నూతన అసిస్టెంట్ ఇంజనీరు ప్రశాంత్,సబ్ ఇంజనీర్ సుశీల, జేఎల్ఎం ప్రశాంత్,బిజెపి రాష్ట్ర నాయకులు తాటి కృష్ణ, సహకార సంఘం చైర్మన్ తోట రమేష్,తెరాస జిల్లా నాయకులు ఉత్సవాయి శ్రీధర్ వర్మ,జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల సుకమార్,తుమ్మల ముఖర్జీ,పూజారి సురేంద్రబాబు కుంట ఏడుకొండలు,చౌలం వెంకటేశ్వర్లు,స్థానిక రైతులు విద్యుత్ వినియోదారులు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: