మన్యం న్యూస్,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో జరుగుతున్న పోడు భూముల సర్వేలో భాగంగా పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు బృందంతో కలిసి బుధవారం నాడు పోడు భూమి సర్వేలో పాల్గొన్నారు. అటవీ శాఖ బీట్ అధికారి ఉపేందర్, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు ను సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగు చేసుకుంటున్న ప్రతి రైతు వివరాలు పొందుపరచబడతాయని, సర్వే విషయంలో ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్, పోడు సాగుదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: