CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిగ్రీ ప్రవేశాలకు చివరి ప్రత్యేక అవకాశం:ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్

Share it:


మన్యం టివి మణుగూరు: 

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ద్వారా ప్రత్యేక చివరి అవకాశం 1 అక్టోబర్ నుండి 7 అక్టోబర్ వరకు కలదని దీనిని ఇంటర్ పూర్తయిన వారు,పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి అయిన వారు వినియోగించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ పత్రిక ప్రకటనలో కోరారు.2022 -23 విద్యాసంవత్సరానికి ఇదే చివరి అవకాశం అని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు వెంటనే తమ  సర్టిఫికెట్స్ తో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఆదివారం,సెలవు దినాలలో సైతం విద్యార్థుల సౌకర్యం కోసం సిబ్బంది అందుబాటులో ఉంటారని వెంటనే వారిని సంప్రదించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు.ఆధార్ లింక్ కలిగి ఉన్న ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలని,దోస్తు ప్రవేశాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కళాశాల నందు విహెచ్ఎల్సి సెంటర్ అందుబాటులో ఉందని,దాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.కళాశాల ప్రవేశాల కొరకు కళాశాల ప్రిన్సిపాల్  99665 21491, సహయ సిబ్బందిని 75694 27393, 96181 63112  ఈ

ఫోన్ నెంబర్లను ద్వారా సంప్రదించవచ్చని 

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: