మన్యం న్యూస్, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఆదివాసి గ్రామం విప్పలగుంపు కు చెందిన ముస్కి ఉంగమ్మ ప్రసవ నిమిత్తం 108 వాహనంలో భద్రాచలం వెళుతుండగా మార్గమధ్యంలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు పాప కాగా మరొకరు బాబు అని డాక్టర్ మహీదు తెలియజేశారు. సురక్షితంగా ఆమెను పైలట్ రమేష్ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు.
Navigation
Post A Comment: